Telugu

Fact Check: అసదుద్దీన్ ఒవైసీ శివ తాండవ స్తోత్రం పఠిస్తున్న వీడియో ఎడిట్ చేయబడింది

AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ హిందూ ప్రార్థన చేస్తున్నట్టు పేర్కొన్న వీడియో ఎడిట్ చేయబడింది మరియు వాయిస్ మార్చబడింది.

Dharavath Sridhar Naik

అసదుద్దీన్ ఒవైసీ, ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ [AIMIM] అధ్యక్షుడు. అతను హైదరాబాద్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్ సభ పార్లమెంట్ సభ్యుడు.

రాబోయే లోక్‌సభ ఎన్నికలకు హైదరాబాద్‌లో AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీకి వ్యతిరేకంగా పోటీ చేయడానికి ప్రముఖ హిందుత్వవాది మాధవి లతను BJP ఎంపిక చేసింది.

హైదరాబాద్ నియోజకవర్గానికి చెందిన పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ, శివుని గౌరవార్థం హిందూ మతపరమైన శ్లోకమైన శివ తాండవ స్తోత్రాన్ని పఠిస్తున్నట్లు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది.

"మాధవీ లత గారు పోటీ చేస్తారు అనగానే సాహెబ్ గారి నోటినుండి శివ తాండవ స్తోత్రం

అద్భుతంగా చెప్పారు సార్, మత ఘర్షణలు లేకుండ చూసుకుంటే మీరే మళ్లీ గెలుస్తారు" అని పెర్కుంటూ ఓ వీడియో X లో పోస్ట్ చేయబడింది.

నిజ నిర్ధారణ:

వైరల్ వీడియో ఎడిట్ చేయబడిందని మరియు అసలు వాయిస్ డిజిటల్‌గా మార్చబడిందని సౌత్ చెక్ కనుగొంది.

వైరల్ వీడియోను నిశితంగా పరిశీలిస్తే ఒవైసీ పెదవుల కదలికలలో అనేక వ్యత్యాసాలు కనిపించాయి. అసలు తను చెప్పేదానికి, మనం వింటున్నదానికి సరైన లిప్ సింక్ లేదు.

వీడియోలో కొన్ని సెకన్లలో అసదుద్దీన్ ముఖం అసహజంగా సాగినట్లు మనం సులభంగా చూడవచ్చు. వీటితో మనం వీడియో ఎడిట్ చేయబడిందని మరియు వాయిస్ మార్చబడిందని నిర్ధారించుకోవచ్చు.

తదుపరి పరిశోధనలో, వైరల్ వీడియో యొక్క గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ను నిర్వహించినప్పుడు, అక్టోబర్ 2022 నాటి అసలు వీడియోను మేము కనుగొన్నాము. ఈ వీడియో కర్ణాటకలోని బీజాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో అసదుద్దీన్ ప్రసంగానికి సంబంధించినది.

వీడియోను పరిశీలించిన తర్వాత, వైరల్ వీడియోకు సంబంధించిన చేతి కదలికలు మరియు సంజ్ఞలు గమనించబడ్డాయి మరియు ఒరిజినల్ ఫుటేజ్‌లోని సెట్టింగ్ మరియు ఒవైసీ వేషధారణ మార్చబడిన వీడియోతో సరిపోలాయి.

మేము ఒరిజినల్ వీడియో మరియు వైరల్ క్లిప్ మధ్య పోలికను చూసినప్పుడు, ఇప్పుడు వైరల్ అవుతున్న 34 సెకన్ల క్లిప్‌ను రూపొందించడానికి కర్ణాటకలోని బీజాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో అసదుద్దీన్ ప్రసంగం నుండి 17 సెకన్ల వీడియో సెగ్మెంట్ పొడిగించబడిందని మేము తెలుసుకున్నాము.

అసలు ప్రసంగంలో, ఒవైసీ మాంసం విక్రయాలు, అధిక ధరల ఎగుమతులు మరియు కర్ణాటకలో అప్పటి-బిజెపి ప్రభుత్వ హయాంలో ముస్లింలను రాక్షసత్వంగా పరిగణించడం వంటి సమస్యలను ప్రస్తావించారు.అంతే కాని అతను ఆ సమావేశంలో ఏ హిందూ ప్రార్థనను జపించలేదు.

అందుకే, 2022లో కర్ణాటకలోని బీజాపూర్‌లో జరిగిన సమావేశంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన ప్రసంగం యొక్క వీడియో ఎడిట్ చేయబడి, వాయిస్ డిజిటల్‌గా మార్చబడిందని మరియు సోషల్ మీడియాలో వైరల్ చేయబడిందని మేము నిర్ధారించాము

Fact Check: Potholes on Kerala road caught on camera? No, viral image is old

Fact Check: ഇത് റഷ്യയിലുണ്ടായ സുനാമി ദൃശ്യങ്ങളോ? വീഡിയോയുടെ സത്യമറിയാം

Fact Check: ஏவுகணை ஏவக்கூடிய ட்ரோன் தயாரித்துள்ள இந்தியா? வைரல் காணொலியின் உண்மை பின்னணி

Fact Check: ರಷ್ಯಾದ ಕಮ್ಚಟ್ಕಾದಲ್ಲಿ ಭೂಕಂಪ, ಸುನಾಮಿ ಎಚ್ಚರಿಕೆ ಎಂದು ಹಳೆಯ ವೀಡಿಯೊ ವೈರಲ್

Fact Check: హైదరాబాద్‌లో ఇంట్లోకి చొరబడి పూజారిపై దాడి? లేదు, నిజం ఇక్కడ తెలుసుకోండి