Fact Check: రైతులు యూరియా ఎక్కువ వాడితే హానికరం అని హెచ్చరించిన చంద్రబాబు.? వీడియో ఎడిట్ చేసినది

రైతులు యూరియా ఎక్కువ వాడితే హానికరం అవుతుందని, అందుకే యూరియా కొరత ఉందని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారని ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
A viral video claims Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu warned farmers against using excess urea.
Published on
1 min read

హైదరాబాద్: సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో సీఎం చంద్రబాబు రైతులకు “యూరియా ఎక్కువ వాడితే హానికరం, అందుకే యూరియా కొరత” అని వార్నింగ్ ఇచ్చారని చెబుతున్నారు. ఈ వీడియోను ఎక్స్‌లో పలు యూజర్లు షేర్ చేశారు. (ఆర్కైవ్)

A viral video claims Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu warned farmers against using excess urea.

ఫాక్ట్ చెక్

సౌత్ చెక్ ఈ క్లెయిమ్‌ని పరిశీలించి అది తప్పు అని గుర్తించింది. అసలు వీడియోను ఎడిట్ చేసి, చంద్రబాబు వ్యాఖ్యల్ని వక్రీకరించారు.

ఈటీవీ భారత్ తెలుగు కథనం ప్రకారం, చంద్రబాబు ప్రెస్ మీట్‌లో ఎరువుల అందుబాటు, సరఫరా స్థిరత్వం, డిజిటల్ పంపిణీ వ్యవస్థల గురించి మాట్లాడారు. ఆయన రైతులకు నమ్మకం కల్పిస్తూ “రాష్ట్రంలో ఎరువులు సరిపడా అందుబాటులో ఉన్నాయి” అన్నారు. ఎక్కడా యూరియా కొరత ఉందని చెప్పలేదు.

అధికారిక హ్యాండిల్ FactCheckAPGov కూడా ఈ క్లెయిమ్‌ని ఖండించింది. వారు విడుదల చేసిన కంపారిజన్ వీడియోలో వైరల్ వీడియోను అసలు వీడియోతో పోల్చి చూపించారు. దీంతో ఆ వీడియో కట్ చేసి ఎడిట్ చేసినదని స్పష్టమైంది.

చివరగా, TV5 న్యూస్ యూట్యూబ్‌లో ఉన్న పూర్తి ప్రెస్ మీట్ వీడియోలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు స్పష్టంగా చూడొచ్చు. అసలు వీడియోలో ఆయన రైతులకు ఎరువుల సరఫరా గురించి మాత్రమే చెప్పారు. వైరల్ వీడియో మాత్రం ఈ అసలు వీడియోలోని కొన్ని బైట్స్‌ని కట్ చేసి కలిపి తప్పుదారి పట్టించేలా తయారు చేశారు.

“యూరియా ఎక్కువ వాడితే హానికరం, అందుకే యూరియా కొరత” అంటూ రైతులకు వార్నింగ్ ఇచ్చారని చంద్రబాబు అన్నారు అనేది తప్పు. ఆ వీడియో ఎడిట్ చేసి, అసలు వ్యాఖ్యల్ని వక్రీకరించారు. కాబట్టి ఈ క్లెయిమ్ తప్పుడుది.

Related Stories

No stories found.
logo
South Check
southcheck.in