Telugu

Fact Check: మార్చి 2024 లో మోడీ ప్రారంభించిన న్యూఢిల్లీ విమానాశ్రయం టెర్మినల్ 1 కూలిపోయింది అంటూ వచ్చిన వార్తల్లో నిజమెంత?

వాస్తవానికి 2009 లో ప్రారంభించిన 15 ఏళ్ల నాటి పాత భవన్ అని సౌత్ చెక్ కనుగొంది.

ravi chandra badugu

న్యూఢిల్లీలో, 2024 జూన్ 28న దాదాపు 228 మిల్లీమీటర్ల (సుమారు 9 అంగుళాలు) వర్షం కురిసింది. ఈ వర్షం కారణంగా దేశంలోని మూడు అతిపెద్ద విమానాశ్రయాలలో ఒకటైన ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 1 లో తీవ్ర నష్టం వాటిల్లింది.

ఈ నేపథ్యంలో, మోడీ కట్టించిన విమానాశ్రయం కూలిపోయింది అంటూ ఒక వీడియో పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

ఆర్కైవ్ లింక్ ఇక్కడ

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న పోస్ట్ అవాస్తవం మరియు ఢిల్లీ విమానాశ్రయం యొక్క టెర్మినల్-1 2009లో ప్రారంభించబడిన 15 ఏళ్ల నాటి నిర్మాణం అని సౌత్ చెక్ కనుగొంది.

మేము వైరల్ అవుతున్న పోస్ట్ ను మరింత శోధిస్తున్నప్పుడు, X లో 2024 జూన్ 28న, NewsMeter మరియు ANI ఖాతా ద్వారా ఒక పోస్ట్‌ని కనుగొన్నాము. అందులో పౌరవిమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు విలేకరులతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన భవనం మరోవైపు ఉందని, ఇక్కడ కుప్పకూలిన భవనం 2009 లో ప్రారంభించిన పాత భవనమని తెలిపారు.

అంతేకాకుండా, 2024 జూన్ 28న Larsen & Toubro X ఖాతా ద్వారా ఒక పోస్ట్‌ని కనుగొన్నాము. అందులో జూన్ 28, 2024 తెల్లవారుజామున ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్ 1 వద్ద జరిగిన దురదృష్టకర సంఘటన వల్ల నష్టపోయిన వారికి మేము మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము అని పేర్కొంది

కూలిపోయిన నిర్మాణాన్ని ఎల్ అండ్ టి నిర్మించలేదని, దాని నిర్వహణకు ల్ అండ్ టి బాధ్యత వహించమని మేము స్పష్టం చేయాలనుకుంటున్నాము. ఈ నిర్మాణాన్ని 2009లో మరొక సంస్థ నిర్మించింది అని తెలియజేసింది

ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (DIAL) అభ్యర్థన మేరకు ఎల్ అండ్ టి 2019లో టి 1 కోసం విస్తరణ ప్రాజెక్టును చేపట్టింది. టి1 యొక్క విస్తరించిన భాగానికి సుమారు 110 మీటర్ల దూరంలో ఈ ఘటన సంభవించింది, దీనిని ఎల్ అండ్ టి నిర్మించి మార్చి 2024 లో ప్రారంభించింది. ఈ విస్తరించిన భాగంపై పతనం ఎటువంటి ప్రభావాన్ని చూపలేదని మేము ధృవీకరిస్తున్నాము అని పేర్కొంది.

అదనంగా, 2024 జూన్ 28న పౌరవిమానయాన శాఖ మంత్రి Ram Mohan Naidu Kinjarapu X ఖాతా ద్వారా ఈ ఉదయం ఢిల్లీ టి1 టెర్మినల్ కూలిపోయిన తరువాత, నేను వ్యక్తిగతంగా సైట్ను తనిఖీ చేసాను. టెర్మినల్ నుండి ప్రయాణీకులందరినీ సురక్షితంగా తరలించడమే మా తక్షణ ప్రాధాన్యత. ఫలితంగా, మధ్యాహ్నం 2 గంటల వరకు షెడ్యూల్ చేసిన అన్ని విమానాలు రద్దు చేయబడ్డాయి. ప్రయాణీకులకు పూర్తి వాపసు లభిస్తుంది లేదా ప్రత్యామ్నాయ విమానాలు మరియు మార్గాల్లో తిరిగి బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత బయలుదేరాల్సిన విమానాలు టి2 మరియు టి3 నుండి నడుస్తాయి "అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రయాణీకుల భద్రతను నిర్ధారించడానికి నిపుణులచే టెర్మినల్ నిర్మాణం యొక్క క్షుణ్ణమైన పరిశీలన నిర్వహించబడేలా నేను చూస్తాను.ఈ సంఘటనకు ప్రతిస్పందనగా, DGCA, BCAS, CISF, Delhi Police, మరియు NDRF సహా అన్ని సంబంధిత ఏజెన్సీలు సన్నిహిత సమన్వయంతో పనిచేస్తున్నాయి.

మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి పరిహారం అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు మరియు మాకు పూర్తి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ దురదృష్టకర సంఘటన వల్ల ప్రభావితమైన వారందరితో మా ఆలోచనలు ఉన్నాయి "అని ఆయన అన్నారు.

అందువల్ల, మోడీ కట్టించిన విమానాశ్రయం కూలిపోయింది అంటూ వచ్చిన వార్త ఎలాంటి వాస్తవం లేదు అని మేము నిర్ధారించాము.

Fact Check: Vijay’s rally sees massive turnout in cars? No, image shows Maruti Suzuki’s lot in Gujarat

Fact Check: പ്രധാനമന്ത്രി നരേന്ദ്രമോദിയെ ഡ്രോണ്‍ഷോയിലൂടെ വരവേറ്റ് ചൈന? ചിത്രത്തിന്റെ സത്യമറിയാം

Fact Check: மன்மோகன் சிங் - சீன முன்னாள் அதிபர் சந்திப்பின் போது சோனியா காந்தி முன்னிலைப்படுத்தப்பட்டாரா? உண்மை அறிக

Fact Check: ಪ್ರವಾಹ ಪೀಡಿತ ಪಾಕಿಸ್ತಾನದ ರೈಲ್ವೆ ಪರಿಸ್ಥಿತಿ ಎಂದು ಎಐ ವೀಡಿಯೊ ವೈರಲ್

Fact Check: రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్రను వ్యతిరేకిస్తున్న మహిళ? లేదు, ఇది పాత వీడియో