Telugu

Fact Check: నరేంద్ర మోదీ, ద్రౌపది ముర్ము, యోగి ఆదిత్యనాథ్, ఏక్‌నాథ్ షిండే పాత ఫోటోలంటూ వైరల్ అవుతున్న చిత్రాలు తప్పుదారి పట్టించేవే

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే — వీరు పదవులు చేపట్టే ముందు సామాన్యులుగా ఉన్నప్పటి పాత ఫోటోలు అంటూ కొన్ని చిత్రాలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి.

Ramesh M

హైదరాబాద్: “అపురూపమైన జీవిత ప్రయాణాలు” అనే క్యాప్షన్‌తో నాలుగు ఫోటోల కొలాజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలలో నరేంద్ర మోదీ, ద్రౌపది ముర్ము, యోగి ఆదిత్యనాథ్, ఏక్‌నాథ్ షిండే తమ రాజకీయ జీవితానికి ముందు సామాన్య జీవితం గడుపుతున్న సమయంలో తీసిన చిత్రాలుగా ప్రచారం చేస్తున్నారు.

ఒక పోస్టులో, “అపురూపమైన జీవిత ప్రయాణాలు.

పై వరుసలో ఎడమ ప్రక్క

చీపురు పట్టుకుని ఊడ్చే

ఈయన ఇప్పుడు భారత్

ప్రధానమంత్రి

*నరేంద్రమోదీ.*

కుడి ప్రక్కన ఉన్న బాగా

వెనుకబడి ఒక పల్లెటూరి

పేదరికపు స్త్రీ ఇప్పుడు

భారతదేశపు రాష్ట్రపతి

*ద్రౌపది ముర్ము.*

ఎడమ ప్రక్కన కూర్చుని

ఉన్న ఆ సాధువు ఇప్పుడు

భారతధేశపు అతి పెద్ద

రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్

ముఖ్యమంత్రి

*యోగి ఆదిత్యనాథ్.*

కుడి ప్రక్కన ఉన్న ఒక

సామాన్య ఆటోరిక్షా డ్రైవర్

ఇప్పుడు భారతదేశపు అతి

పెద్ద భాగ్యవంతపు మరియు

ముంబయితో కలుపుకుని

ఉన్న అతిపెద్ద వాణిజ్య

రాష్ట్రంగా పేరొందిన

మహారాష్రకు ముఖ్యమంత్రి

*ఏకనాథ్ షీండే.*

*అపురూపమైన జీవిత*

*ప్రయాణాలు కదా.

” అని పేర్కొన్నారు. (Archive)

ఫ్యాక్ట్ చెక్

సౌత్ చెక్ పరిశీలనలో ఈ క్లెయిమ్ తప్పు అని తేలింది.వైరల్ అవుతున్న పోస్టులో ఉన్న నాలుగు ఫోటోలలో కేవలం యోగి అదిత్యనాథ్ ఫోటో మాత్రమే నిజమైనది.

వైరల్ పోస్టులో మొదటి ఫోటోలో చీపురు పట్టుకుని నేల ఊడుస్తున్న వ్యక్తిని ప్రధాని నరేంద్ర మోదీగా పేర్కొన్నారు. అయితే ఈ ఫోటోపై గతంలోనే వివాదం నెలకొంది. ఈ చిత్రంపై దాఖలైన RTI పిటిషన్‌కు అధికారికంగా వచ్చిన సమాధానం ప్రకారం, ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి నరేంద్ర మోదీ కాదని స్పష్టం అయ్యింది. ఈ ఫోటో ఎడిట్ చేయబడినదని కూడా తేలింది. అంటే, మోదీ పేరుతో ప్రచారం చేస్తున్న ఈ చిత్రం పూర్తిగా తప్పుదారి పట్టించేదే.

ఇక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంటూ ప్రచారం చేస్తున్న ఫోటోపై సౌత్ చెక్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసింది. ఈ ఫోటో CNN-News18 వెబ్‌సైట్‌లో ప్రచురితమైన ఓ కథనంలో లభించింది. ఆ కథనం ప్రకారం, ఈ ఫోటోలో కనిపిస్తున్న మహిళ పేరు సుకుమార్ తుడు. ఆమె ఒడిశా రాష్ట్రంలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నారు. ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత, ఆమె స్వగ్రామ ప్రాంతంలో ప్రజల అభిప్రాయాలను సేకరించిన సమయంలో ఈ ఫోటో తీసినట్టు కథనం వెల్లడించింది. కాబట్టి, ఈ ఫోటో ద్రౌపది ముర్ముదీ కాదని స్పష్టమవుతోంది.

మూడో ఫోటో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌దిగా ప్రచారం అవుతోంది. ఈ ఫోటో విషయంలో క్లెయిమ్ మాత్రం సరైనదే. 2017లో టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన కథనంలో ఈ ఫోటో కనిపించింది. ఆ కథనం ప్రకారం, 1994లో గోరఖ్‌నాథ్ ఆలయాధిపతి మహంత్ అవైద్యనాథ్ శిష్యుడిగా అజయ్ సింగ్ బిష్త్ దీక్ష స్వీకరించిన సమయంలో ఈ చిత్రం తీసారు. ఆ తరువాత ఆయన యోగి ఆదిత్యనాథ్‌గా ప్రసిద్ధి చెందారు. అందువల్ల, ఈ ఫోటో యోగి ఆదిత్యనాథ్‌దేనని నిర్ధారణ అయ్యింది.

చివరిగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే పాత ఫోటోగా ప్రచారం చేస్తున్న చిత్రాన్ని పరిశీలించగా, అది కూడా తప్పని న్యూస్‌మీటర్ గుర్తించింది. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు బాబా కాంబ్లే. ఆయన మహారాష్ట్ర ఆటోరిక్షా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు. 1997లో దిగిన ఈ ఫోటో వైరల్ కావడంతో, బాబా కాంబ్లే ABP Newsకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు. తనకు, ముఖ్యమంత్రి షిండేకు గడ్డం ఒకే విధంగా ఉండటంతో ఈ గందరగోళం ఏర్పడిందని, ఈ ఫోటో తనదేనని ఆయన స్పష్టంచేశారు.

“అపురూపమైన జీవిత ప్రయాణాలు” అంటూ వైరల్ అవుతున్న పోస్టులో ఉన్న నాలుగు ఫోటోలలో కేవలం యోగి ఆదిత్యనాథ్‌ ఫోటో మాత్రమే నిజమైనది.
నరేంద్ర మోదీ, ద్రౌపది ముర్ము, ఏక్‌నాథ్ షిండే పేర్లతో ప్రచారం చేస్తున్న మిగతా ఫోటోలు వారివి కావు.
అందువల్ల, ఈ పోస్టు తప్పుదారి పట్టించేదిగా సౌత్ చెక్ నిర్ధారిస్తోంది.

Fact Check: Massive protest in US against Trump’s immigration policies? No, here is the truth

Fact Check: നിക്കോളസ് മഡുറോയുടെ കസ്റ്റഡിയ്ക്കെതിരെ വെനിസ്വേലയില്‍ നടന്ന പ്രതിഷേധം? ചിത്രത്തിന്റെ സത്യമറിയാം

Fact Check: கேரளப் பேருந்து காணொலி சம்பவத்தில் தொடர்புடைய ஷிம்ஜிதா கைது செய்யப்பட்டதாக வைரலாகும் காணொலி? உண்மை அறிக

Fact Check: ICE protest in US leads to arson, building set on fire? No, here are the facts

Fact Check: ಬಾಂಗ್ಲಾದೇಶದಲ್ಲಿ ಗಾಂಧೀಜಿ ಪ್ರತಿಮೆಯ ಶಿರಚ್ಛೇದ ಮಾಡಿರುವುದು ನಿಜವೇ?, ಇಲ್ಲಿದೆ ಸತ್ಯ