Telugu

Fact Check: యోగి ఆదిత్యనాథ్ ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఇంట్లో ఈద్ విందును ఆస్వాదిస్తున్నారా? లేదు, ఇక్కడ నిజం తెలుసుకోండి

యోగి ఆదిత్యనాథ్ ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఇంట్లో ఈద్ విందును ఆస్వాదించారన్న క్లెయిమ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Sherly

Hyderabad: ముస్లింలు మార్చి 31న ఈద్ జరుపుకుంటున్నప్పుడు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంచంపై కూర్చుని, బీజేపీ నాయకులు ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, హేమ మాలినిలతో కలిసి భోజనం చేస్తున్నట్లు చుపిస్తున్న ఒక చిత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈద్ శుభాకాంక్షలు తెలియజేయడానికి, సేవైయాన్ (వెర్మిసెల్లి డెజర్ట్)లో పాల్గొనడానికి సీఎం ఆదిత్యనాథ్ నఖ్వీ నివాసాన్ని సందర్శించారని క్లెయిమ్ చేస్తూ చిత్రాన్ని షేర్ చేస్తున్నారు.

"ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈద్ శుభాకాంక్షలు తెలియజేయడానికి మాజీ కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఇంటికి వెళ్లడం ద్వారా ముస్లిం వ్యతిరేకి అనే అపోహను బద్దలు కొట్టారు. అశోక్ సింఘాల్ కుమార్తె సీమా నఖ్వీ తయారుచేసిన సేవైయాన్ (వర్మిసెల్లి డెజర్ట్)ను కూడా ఆయన ఆస్వాదించారు" అనే క్యాప్షన్‌తో ఫేస్‌బుక్‌లో ఈ చిత్రాన్ని షేర్ చేశారు. (హిందీ నుండి అనువదించబడింది)

ఇవే క్లెయిమ్స్ చేస్తున్న పోస్టును ఇక్కడ చూడవచ్చు.

Fact Check

సౌత్ చెక్ ఈ క్లెయిమ్ తప్పు అని కనుగొంది. ఈ చిత్రం 2021 నాటిది, ఇటీవల యోగి ఆదిత్యనాథ్ నఖావీ ఇంట్లో ఈద్ విందును ఆస్వాదిస్తున్నట్లు చూపించడం లేదు.

రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించినప్పుడు, నవంబర్ 11, 2021న ప్రచురించబడిన Indian Express కథనంలో ఈ చిత్రాన్ని కనుగొన్నాం. ఈ కథనం ప్రకారం, ఈ చిత్రం ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లాలోని బృందావన్‌లో జరిగిన 'హునార్ హాత్' కార్యక్రమంలో యోగి ఆదిత్యనాథ్, అప్పటి కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, ఎంపీ హేమా మాలినిని చూపిస్తుంది.

నవంబర్ 10, 2021న ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ అధికారిక ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేయబడిన వైరల్ ఫోటోతో సహా అనేక చిత్రాలను కూడా కనుగొన్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ “ఆత్మనిర్భర్ భారత్” దిశగా కృషిచేస్తున్న శిల్పకారులను, కళాకారులను యోగి ఆదిత్యనాథ్ ప్రశంసించారని పోస్ట్‌లో పేర్కొన్నారు. శతాబ్దాల నాటి భారతదేశ హస్తకళల వారసత్వం గురించి మాట్లాడుతూ.. సాంప్రదాయ కళారూపాలను సంరక్షించడం. ప్రోత్సహించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. "మేరా గావ్ మేరా దేశ్" విభాగంలో 'ఖతియా'పై కూర్చున్న ఆదిత్యనాథ్ సాంప్రదాయ వంటకాలను ఆస్వాదించారని కూడా పోస్ట్‌లో పేర్కొంది.

నవంబర్ 11, 2021 నాటి ANI నివేదిక ప్రకారం, ఉత్తరప్రదేశ్‌లోని మధురలో "కౌశల్ కుబేర్ కుంభ్"గా, "బ్రజ్ రాజ్ ఉత్సవ్"లో భాగంగా వర్ణించబడిన బృందావన్‌లో యోగి ఆదిత్యనాథ్ 31వ ఎడిషన్ 'హునార్ హాత్'ను ప్రారంభించారు. ఈ కార్యక్రమం దేశంలోని ప్రతిభావంతులైన శిల్పకారులకు, కళాకారులకు, పాక నిపుణులకు వేదికను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.

కాబట్టి, నఖ్వీ ఇంట్లో ఆదిత్యనాథ్ ఈద్ విందును ఆస్వాదిస్తున్నట్లు ఆ చిత్రంలో చూపించలేదని నిర్ధారించాం. వైరల్ క్లెయిమ్స్ తప్పు.

Fact Check: Muslim woman throws slippers, stones at Chhatrapati Shivaji statue in Pune? No, here are the facts

Fact Check: ഇത് മുഖ്യമന്ത്രി വി ഡി സതീശന്റെ വാഹനവ്യൂഹമോ? വീഡിയോയുടെ സത്യമറിയാം

Fact Check: முதல்வர் விஜய்யின் பெற்றோரின் திருமணத்தின் போது அவர் அருகில் இருந்ததாக பரவும் புகைப்படம் உண்மையானதா அல்லது போலியானதா?

Fact Check: ವೃಷಭಾವತಿ‌ ನದಿಯಲ್ಲಿ 500 ರೂ. ಮುಖಬೆಲೆಯ ಕಂತೆ ಕಂತೆ ನೋಟು ಪತ್ತೆ?, ವೈರಲ್ ವೀಡಿಯೊದ ಸತ್ಯ ಇಲ್ಲಿದೆ

Fact Check : ప్రధాని మోదీని దూషించినందుకు తల్లిదండ్రులు కుమార్తెను కొట్టారా? లేదు, వైరల్ వీడియో పాతది